రాజధానిలో పూర్తి సామర్థ్యంతో మెట్రో సేవలు.... ఇంకా....

ABN , First Publish Date - 2021-07-25T12:28:32+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన...

రాజధానిలో పూర్తి సామర్థ్యంతో మెట్రో సేవలు.... ఇంకా....

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(డీడీఎంఏ) కీలక ప్రకటన చేసింది. జూలై 26 నుంచి ఢిల్లీ మెట్రోతో పాటు బస్సు సర్వీసులు పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అనుమతినిచ్చింది. అదేవిధంగా సినిమాహాళ్లు, మల్టీ‌ఫ్లెక్స్‌లు 50 శాతం సామర్థ్యంతో తెరవవచ్చని తెలిపింది. 


దీంతో ఇకపై మెట్రోరెళ్లు, బస్సులలో ప్రయాణికులు అన్ని సీట్లలో కూర్చుని ప్రయాణించేందుకు అవకాశం కలిగింది. ఇంతకుముందే ఢిల్లీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రతిపాదనను డీడీఎంఏకు పంపింది. దీనిపై చర్చ జరిపిన డీడీఎంఏ అధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా మెలగాలని, కరోనా గైడ్‌లైన్స్ పాటించాలని కోరింది.

Updated Date - 2021-07-25T12:28:32+05:30 IST