మెట్రోలో పెరిగిన ప్రయాణికులు
ABN , First Publish Date - 2020-10-31T08:03:35+05:30 IST
మెట్రోలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ చార్జీల తగ్గింపు మంచి ఫలితాలను ఇస్తోంది. శుక్రవారం సాయంత్రం మెట్రో కిటకిటలాడింది.
పంజాగుట్టలో సాంకేతిక సమస్యతో ఆగిన మెట్రో
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 30 (ఆంధ్రజ్యోతి) : మెట్రోలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ చార్జీల తగ్గింపు మంచి ఫలితాలను ఇస్తోంది. శుక్రవారం సాయంత్రం మెట్రో కిటకిటలాడింది. లాక్డౌన్ అనంతరం ఇంత స్థాయిలో రద్దీ చూడడం ఇదే ప్రథమం అని రోజూ వెళ్లే ప్రయాణికులు తెలిపారు.
పాకెట్ ట్రాక్కు మెట్రో :
సాంకేతిక సమస్యల కారణంగా పంజాగుట్ట మెట్రోస్టేషన్లో ఓ మెట్రో నిలిచిపోయింది. దానిని పాకెట్ ట్రాక్ (లూప్లైన్)లోకి తరలించేందుకు మరో మెట్రో ఎదురుగా వచ్చింది. దాని సహాయంతో ఆ రైలును పాకెట్ ట్రాక్కు మళ్లించి లైన్ను క్లియర్ చేశారు. మెట్రోరైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోతే వాటిని నిలిపి ఉంచేందుకు పంజాగుట్ట, బేగంపేటలో పాకెట్ ట్రాక్లు ఉన్నాయని మెట్రో అధికారులు తెలిపారు.