21 ఏళ్ల తర్వాత మెస్సీ షాకింగ్ డెసిషన్..
ABN , First Publish Date - 2021-08-06T09:54:32+05:30 IST
ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. 21 ఏళ్లుగా ఆడుతున్న బార్సిలోనా క్లబ్కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సదరు క్లబ్ స్వయంగా..
బ్రెజిల్: ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. 21 ఏళ్లుగా ఆడుతున్న బార్సిలోనా క్లబ్కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సదరు క్లబ్ స్వయంగా ప్రకటించింది. 2000వ సంవత్సరంలో యువ ఆటగాడిగా బార్సిలోనా క్లబ్లో అడుగుపెట్టిన మెస్సీ.. అప్పటి నుంచి అదే క్లబ్కు ఆడుతున్నాడు. అయితే తాజాగా పాత కాంట్రాక్ట్ను రద్దు చేసి.. కొత్త కాంట్రాక్ట్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన వ్యత్యాసాలు, కొన్ని లీగ్ల నిబంధనల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో వీరి ఒప్పందం కుదరలేదు. ఈ కారణంగా మెస్సీ రెండు దశాబ్దాల తర్వాత బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్కు గుడ్ బై చెప్పాడు.
కాగా.. మెస్సి తమ క్లబ్ నుంచి వెళ్లిపోతున్న నేపథ్యంలో అతడి భవిష్యత్తు గొప్పగా కొనసాగాలని బార్సిలోనా క్లబ్ ఆకాక్షించింది. ఇన్నేళ్ల పాటు తమ క్లబ్ తరపున సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.