జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
ABN , First Publish Date - 2022-08-09T05:44:50+05:30 IST
జేఈఈ మెయిన్స్లో మండలానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
పార్వతీపురం-ఆంధ్రజ్యోతి/గరుగుబిల్లి : జేఈఈ మెయిన్స్లో మండలానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో రావివలసకు చెందిన గుంట్రెడ్డి రుషిబాబు 406వ ర్యాంకు సాధించాడు. ఓబీసీ కేటగిరిలో 49వ ర్యాంకు పొందాడు. సంతోషపురానికి చెందిన అంబటి గురుచరణ్ ఓబీసీ కేటగిరీలో 2810వ ర్యాంకు సాధించారు. సీతానగరం మండలం చినభోగిల గ్రామానికి చెందిన చుక్క నితిన్ 415వ ర్యాంకు సాధించాడు. గుచ్ఛిమి గ్రామానికి చెందిన రెడ్డి లీలా జోగందర్ సాయి 312 ర్యాంకు సాధించాడు. ఓబిసి కేటగిరిలో 41వ ర్యాంకు పొందాడు. మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన ఆమిటి ప్రియాంక 744వ ర్యాంకును సాధించారు. ఓబీసీ కేటగిరీలో 79వ ర్యాంకు లభించింది.
111111111111111111111