మెయిన్స్లో మెరిశాడు
ABN , First Publish Date - 2022-08-09T06:44:27+05:30 IST
జేఈఈ మెయిన్స్లో జిల్లా విద్యార్థి మెరిశాడు. పెదయిర్లపాడుకు చెందిన పోలు లోహిత్రెడ్డి 27వ ర్యాంకు సాధించాడు.
మెయిన్స్లో మెరిశాడు
జేఈఈలో పెదయిర్లపాడు విద్యార్థికి 27వ ర్యాంకు
పీసీపల్లి, ఆగస్టు 8 : జేఈఈ మెయిన్స్లో జిల్లా విద్యార్థి మెరిశాడు. పెదయిర్లపాడుకు చెందిన పోలు లోహిత్రెడ్డి 27వ ర్యాంకు సాధించాడు. ఇటీవల ఏపీ ఈఏపీ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన లోహిత్రెడ్డి సోమవారం విడుదల చేసిన మెయిన్స్ ఫలితాల్లోనూ సత్తా చూపాడు. 300 మార్కులకు 290 సాధించాడు. తల్లిదండ్రులు పోలు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంతం ప్రభుత్వ ఉపాధ్యాయులు. దర్శి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాల్యాద్రిరెడ్డి, తూర్పుగంగవరంలో ఎస్జీటీగా లక్ష్మీకాంతం పనిచేస్తున్నారు. లోహిత్రెడ్డిని తలిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.