నిఘా నీడలో Mereena బీచ్‌

ABN , First Publish Date - 2021-11-24T13:08:49+05:30 IST

ప్రత్యక్ష పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ‘జల్లికట్టు ఉద్యమం’ తరహాలో మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగనున్నట్లు అందిన సమాచారంతో సుమారు 200 మంది పోలీసులు బీచ్‌ పొడవునా కాపలాకు

నిఘా నీడలో Mereena బీచ్‌

               - 200 మంది పోలీసులతో పహారా


చెన్నై: ప్రత్యక్ష పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ‘జల్లికట్టు ఉద్యమం’ తరహాలో మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగనున్నట్లు  అందిన సమాచారంతో సుమారు 200 మంది పోలీసులు బీచ్‌ పొడవునా కాపలాకు నియమితులయ్యారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలంటూ విద్యార్థులు పలు చోట్ల ఇటీవల ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు మెరీనాబీచ్‌ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నాయని మంగళవారం ఉదయం రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు తీరం పొడవునా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. మెరీనాబీచ్‌లోని ‘నమ్మచెన్నై’ సెల్ఫీ వద్ద, లైట్‌హౌస్‌ వద్ద, కార్మికుల విగ్రహం కూడలి వద్ద పోలీసులు సముద్రతీరం వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-11-24T13:08:49+05:30 IST