పాఠశాలల విలీన జీవో రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-07-07T05:42:41+05:30 IST
ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో అచ్చియ్యమ్మ పేట ప్రాఽథమిక పాఠశాల వద్ద బుధవారం నిరసన చేపట్టారు.
జ్ఞానాపురం, జూలై 6 : ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో అచ్చియ్యమ్మ పేట ప్రాఽథమిక పాఠశాల వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని ఆరోపించారు. సాఫీగా సాగుతున్న విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా అసమంజప నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నదని మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు అధ్యక్షుడు వాసుపల్లి రామ్కుమార్, పుక్కళ్ళ రాజేశ్వరి, సారిపల్లి మహేష్, వరుకూటి గణేష్, గనగళ్ల సత్య, దాసాన సత్యనారాయణ, రమేశ్రెడ్డి పాల్గొన్నారు.