మెర్సిడెస్ ఎస్యూవీ కూపే
ABN , First Publish Date - 2020-09-24T06:23:44+05:30 IST
మెర్సిడెస్ ఎస్యూవీ కూపే
ధర రూ.1.2 కోట్లు
ముంబై : మెర్సిడెస్ బెంజ్ సరికొత్త మిడ్ సైజ్ ఎస్యూవీ ఏఎంజీ జీఎల్ఈ 53 4మాటిక్+కూపేను మార్కెట్లోకి తెచ్చింది. దేశంలో కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.1.2 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న ఏఎంజీ 43 కూపే స్థానంలో ఈ కారు ప్రవేశపెట్టినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం భారత మార్కెట్లో కంపెనీకి చెందిన మొత్తం ఏడు ఎస్యూవీలు, ఎస్యూవీ కూపేలు ఉన్నట్టవుతుందని తెలియచేసింది. ఈ కారు 300డి, 400డి, 450, ఏఎంజీ జీఎల్ఈ 53 కూపె వేరియెంట్లలో ఇది అందుబాటులో ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) సంతోష్ అయ్యర్ తెలిపారు.