ఆ ట్రక్ డ్రైవర్లని కలవాలని ఉంది: మీరాబాయి చాను

ABN , First Publish Date - 2021-07-31T05:52:21+05:30 IST

మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌‌లో భారత్‌కు తొలి పతకం సాధించిన పెట్టిన వెయిట్ లిఫ్టర్. ఆమె పతకం గెలవడంతో..

ఆ ట్రక్ డ్రైవర్లని కలవాలని ఉంది: మీరాబాయి చాను

టోక్యో: మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌‌లో భారత్‌కు తొలి పతకం సాధించిన పెట్టిన వెయిట్ లిఫ్టర్. ఆమె పతకం గెలవడంతో ఆమెకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన భారీ నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలూ ఆమెకు దాసోహం అన్నాయి. కానీ మీరాబాయి వీటన్నింటితో ఆనందంగా ఉన్నా.. తన మనసులోని ఓ చిన్న కోరికను తాజాగా మీరాబాయి బయటపెట్టారు. మణిపుర్‌లో తాను వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్‌కు వెళ్లేటప్పుడు తనకు రోజూ లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్స్‌ను కలవాలని ఉందని అన్నారు. ‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లంతా నాకెంతగానో సహాయం చేశారు. ఇసుక లోడు తీసుకెళుతూ రోజూ నాకు లిఫ్ట్ ఇచ్చేవారు. వారి కోసం ఎదురు చూస్తున్నా. వాళ్లని ఒకసారి కలవాలని ఉంది. వారికి ఏదైనా సాయం చేయాలని ఉంది’ అని మీరాబాయి చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-07-31T05:52:21+05:30 IST