ఎంఈవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ
ABN , First Publish Date - 2022-05-20T05:12:29+05:30 IST
జమ్మలమడుగులోని కన్నెలూరు గ్రామంలో ఎంఈవో కార్యాలయాన్ని గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మార్తల వెంకటకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జమ్మలమడుగు రూరల్, మే 19: జమ్మలమడుగులోని కన్నెలూరు గ్రామంలో ఎంఈవో కార్యాలయాన్ని గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మార్తల వెంకటకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడారు. ఎంఈవో, సిబ్బంది తదితరులపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు యూడీఐఎ్సఈ (టీచర్స్ ఇన్ఫర్మేషన్), జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, తదితర పనులకు సంబంధించి కార్యాలయ సీఆర్పీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యల రిపోర్టును తీసుకున్నారు.