ఎంఈవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2022-05-20T05:12:29+05:30 IST

జమ్మలమడుగులోని కన్నెలూరు గ్రామంలో ఎంఈవో కార్యాలయాన్ని గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మార్తల వెంకటకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎంఈవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ
మాట్లాడుతున్న పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు కృష్ణారెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, మే 19: జమ్మలమడుగులోని కన్నెలూరు గ్రామంలో ఎంఈవో కార్యాలయాన్ని గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మార్తల వెంకటకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడారు. ఎంఈవో, సిబ్బంది తదితరులపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు యూడీఐఎ్‌సఈ (టీచర్స్‌ ఇన్ఫర్మేషన్‌), జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, తదితర పనులకు సంబంధించి కార్యాలయ సీఆర్‌పీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యల రిపోర్టును తీసుకున్నారు.  


Updated Date - 2022-05-20T05:12:29+05:30 IST