క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2021-12-05T05:30:00+05:30 IST

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగి స్తాయని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

రాజుపాళెం, డిసెంబరు 5: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగి స్తాయని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రమైన రాజుపాళెంలో జిల్లా బాలబాలికల బ్యాడ్మింటన్‌ పోటీలను  ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై ప్రారంభించారు. జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇందులో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ప్రతిభ కనపరచిన విద్యార్థులను జట్టుగా ఏర్పాటు చేసి 12, 13వ తేదీల్లో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొననున్నట్ల తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ వీఎ్‌సముక్తియార్‌, నాయకులు కిరణ్‌రెడ్డి, నల్లబోతుల నాగరాజు, కశిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, విశ్వనాథరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, పగిడాల దస్తగిరి పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-05T05:30:00+05:30 IST