principal పోస్ట్ కోసం చితక బాదుకున్న టీచర్లు

ABN , First Publish Date - 2021-10-15T16:32:41+05:30 IST

బీహార్ విద్యా శాఖ కార్యాలయంలో ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది...

principal పోస్ట్ కోసం చితక బాదుకున్న టీచర్లు

జిల్లా విద్యాశాఖ కార్యాలయం సాక్షిగా...

పాట్నా: బీహార్ విద్యా శాఖ కార్యాలయంలో ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆడాపూర్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్ పదవి కోసం శివశంకర్ గిరి, రింకీకుమారిలు పోటీపడుతున్నారు. తాను సీనియర్ నంటే తానేనని ఇద్దరు ఉపాధ్యాయులు గత మూడు నెలలుగా పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయుల అర్హతలు, సీనియారిటీ పత్రాలను సమర్పించాలని మోతిహరి జిల్లా విద్యాశాఖ అధికారులు కోరారు. 


ఉపాధ్యాయుడు శివశంకర్ గిరి, మరో మహిళా ఉపాధ్యాయురాలు రింకికుమారి భర్త వారివారి సీనియారిటీ, అర్హతల పత్రాలు తీసుకొని విద్యాశాఖ కార్యాలయానికి వచ్చారు. అంతలో విద్యాశాఖ కార్యాలయంలోనే మాటా మాటా పెరిగి ఇద్దరు బాహాబాహీకి దిగారు. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి వారిని విడదీశారు.పాఠశాల ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఉపాధ్యాయుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని బీహార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హరియోమ్ సింగ్ చెప్పారు. 


Updated Date - 2021-10-15T16:32:41+05:30 IST