పవన్కల్యాణ్ దృష్టికి కైకలూరు సమస్యలు
ABN , First Publish Date - 2022-07-04T06:04:20+05:30 IST
పవన్కల్యాణ్ దృష్టికి కైకలూరు సమస్యలు
కైకలూరు, జూలై 3: కైకలూరు నియోజకవర్గంలోని సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టు కైకలూరు జనసేన పార్టీ నాయకుడు సీఏబీవీ రావు తెలిపారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో పవన్కల్యాణ్కు వినతిపత్రం అంద జేశామన్నారు. నియోజకవర్గంలో కొల్లేరుప్రాంత ప్రజల ఇబ్బందులను, జనసేన పార్టీ నాయకుడు కోటి నాగరాజుపై ఇటీవల అధికార పార్టీ నాయకులు చేసిన దాడులను పవన్కల్యాణ్కు వివరించినట్లు తెలిపారు. కొల్లేరు ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడు మోరు విజయరాజు, పార్టీ నాయకులు తోట లక్ష్మి, శొంఠి రాజేశ్వరి, అట్లూరి రాజేష్, ఎడ్ల ఈశ్వరరావు, పేటేటి కనకరాజు పాల్గొన్నారు.