పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదే కీలకం
ABN , First Publish Date - 2022-08-19T06:41:40+05:30 IST
గ్రామ స్థాయిలో టీడీపీ బలోపేతం చేయడానికి సభ్యత్వాల నమోదే కీలకమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి తాతయ్యబాబు
రోలుగుంట, ఆగస్టు 18: గ్రామ స్థాయిలో టీడీపీ బలోపేతం చేయడానికి సభ్యత్వాల నమోదే కీలకమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. గురువారం రోలుగుంటలో స్థానిక పాలకేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తలు, సభ్యత్వ నమోదు ప్రముఖుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కోవాలంటే సభ్యత్వమే కీలకమన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తే పూర్వవైభవం సాధించవచ్చునన్నారు. నియోజకవర్గంలో 60 శాతం సభ్యత్వాల నమోదు పూర్తయ్యిందని, శతశాతం పూర్తిచేయడానికి కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామాల వారీగా సభ్యత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, నర్సీపట్నం టీడీపీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, ఐటీడీపీ మండల ఇన్చార్జి బంటు రాజు, ఎంపీటీసీ సభ్యుడు సుర్ల రామకృష్ణ, నాయకులు రొంగలి రమణ, పిట్ల బుల్లిబాబు, బోళెం రమేష్, పోతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.