పీఆర్టీయూ నాయకుల సభ్యత్వ నమోదు

ABN , First Publish Date - 2020-12-06T04:33:15+05:30 IST

జిల్లాలోని బెజ్జూరు, జైనూర్‌ మండలాల్లో శనివారం పీఆర్టీయూటీఎస్‌ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేప ట్టారు

పీఆర్టీయూ నాయకుల సభ్యత్వ నమోదు
బెజ్జూరులో సభ్యత్వ నమోదు చేపడుతున్న పీఆర్టీయూ నాయకులు

బెజ్జూరు/జైనూర్‌, డిసెంబరు 5: జిల్లాలోని బెజ్జూరు, జైనూర్‌ మండలాల్లో శనివారం పీఆర్టీయూటీఎస్‌ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేప ట్టారు.  జెజ్జూరు మండలంలోని వివిధ పాఠశాలల్లో నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని, కేజీబీవీ ఉపాధ్యా యులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు దేవాజీ, శ్రావణ్‌, తిరుపతి, సుభాష్‌, అరవింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  జైనూర్‌ మండలంలోని పోచంలొ ద్ది కేజీబీవీలో పీఆర్టీయూటీఎస్‌ నాయకులు సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌  మాట్లాడారు. ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజలో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భూమున్న, దత్తు ఉపాధ్యా యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:33:15+05:30 IST