ప్లీనరీకి బలవంతంగా మహిళాసంఘాల సభ్యులు

ABN , First Publish Date - 2022-06-26T05:50:41+05:30 IST

హిందూపురంలో శనివారం జరిగిన వైసీపీ ఫ్లీనరీ సమావేశానికి మహిళాసంఘాల సభ్యులను వైసీపీ నాయకులు బలవంతంగా తరలించారు.

ప్లీనరీకి బలవంతంగా మహిళాసంఘాల సభ్యులు
వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు

హిందూపురంటౌన, జూన 25 : హిందూపురంలో శనివారం జరిగిన వైసీపీ ఫ్లీనరీ సమావేశానికి మహిళాసంఘాల సభ్యులను వైసీపీ నాయకులు బలవంతంగా తరలించారు. ఇటీవల అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో ఎలాగైనా ఫ్లీనరీని విజయవంతం చేయాలని, ఇందుకోసం భారీ ఎత్తున జనాన్ని తరలించాలని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, కార్యదర్శులు వైసీపీకి చెందినవారు కావడంతో మహిళాసంఘాల సభ్యులను బలవంతంగా ఈ కార్యక్రమానికి తరలించినట్టు  కొంతమంది సభ్యులు వాపోయారు. ఈ సమావేశానికి దాదాపు 200 మందికి దాకా మహిళాసంఘాల సభ్యులు వచ్చారు. వీరంత పట్టణానికి చెందిన వారే.


Updated Date - 2022-06-26T05:50:41+05:30 IST