అధికారుల పనితీరుపై సభ్యుల మండిపాటు

ABN , First Publish Date - 2022-08-12T05:37:00+05:30 IST

ధర్మారం మండల ప్రభుత్వ అధికారుల పని తీరుపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు మండిపడ్డారు.

అధికారుల పనితీరుపై సభ్యుల మండిపాటు
మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ కరుణశ్రీ

- ధర్మారం మండల సర్వసభ్య సమావేశం

జూలపల్లి(ధర్మారం), ఆగస్టు 11 : ధర్మారం మండల ప్రభుత్వ అధికారుల పని తీరుపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు మండిపడ్డారు. దీంతో సమావే శం రసాభాసగా మారింది. మండలపరిషత్‌ అధ్యక్షురాలు ముత్యాల కరుణశ్రీ అధ్యక్ష తన గురువారం సర్వసభ్య సహావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పశువైద్యాధికా రి అజయ్‌ పనితీరుపై ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విండోచైర్మెన్‌ ముత్యాల బలరాంరెడ్డి సైతం అసహనం వ్యక్తం చేస్తూ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మిషన్‌ భగీరథ తాగునీరు సక్రమంగా అందడం లేద ని ఎంపీటీసీ వేణుగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బం ది నిభందనలను పాటిస్తూ బాధ్యతగా పనిచేయాలని ఎంపీపీ కరుణశ్రీ సూచించా రు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీవో జయశీల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పం చు పుస్కూరి జితెందర్‌రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:37:00+05:30 IST