మెలానియా ట్రంప్ విగ్రహానికి నిప్పంటించిన దుండగులు..!

ABN , First Publish Date - 2020-07-10T05:22:43+05:30 IST

అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటిచిన ఘటన ఆలస్యంగా వెలు

మెలానియా ట్రంప్ విగ్రహానికి నిప్పంటించిన దుండగులు..!

వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెర్లిన్‌కు చెందిన అమెరికా కళాకారుడు బ్రాడ్ డౌనీ, చెక్కతో తయారు చేసిన మెలానియా ట్రంప్ విగ్రహాన్ని.. జూలై 5, 2019లో ఆమె స్వస్థలం స్లొవేనియాలో ఏర్పాటు చేశారు. జూలై 4, అమెరికా స్వతంత్ర్య దినోత్సవం రోజున  కొందరు గుర్తు తెలియని దుండగులు.. ఆమె విగ్రహానికి నిప్పంటించారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వాళ్లు బ్రాడ్ డౌనీకి ఈ నెల 5న సమాచారం అందించారు. దీంతో మెలానియా ట్రంప్ విగ్రహాన్ని బ్రాడ్ డౌనీ అక్కడ నుంచి తొలగించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహానికి నిప్పంటించిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష పదివికి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2020-07-10T05:22:43+05:30 IST