ఫరూక్ అబ్దుల్లా, మెహబూబాలపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-28T14:26:25+05:30 IST

నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్సు డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) మెహబూబా ముఫ్తీలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు...

ఫరూక్ అబ్దుల్లా, మెహబూబాలపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్సు డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) మెహబూబా ముఫ్తీలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. రద్దు చేసిన 370 సెక్షన్ ను పునరుద్ధరించాలని ఫరూక్ అబ్దుల్లా, మెహబూబాలు డిమాండ్ చేయడంపై  కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు భారతదేశంలో ఉండటానికి హక్కు లేదని జోషి వ్యాఖ్యానించారు. చైనా దేశం మనపై దాడి చేస్తున్న సమయంలో ఆ దేశ సహాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పడం ఏమిటని, దీనిద్వారా అంతర్జాతీయ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేంద్రమంత్రి ప్రశ్నించారు.


14 నెలల నిర్బంధంలో నుంచి విడుదలైన తర్వాత ఇటీవల తన మొదటి విలేకరుల సమావేశంలో మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, ‘‘జమ్మూ కాశ్మీర్ జెండాను ఎగురవేయడానికి అనుమతించకపోతే ఆమె పార్టీ భారత త్రివర్ణ పతకాన్ని ఎగురవేయదు’’ అని అన్నారు. గత ఏడాది ఆగస్టు 5 న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేయడానికి ముందు, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉన్నాయి.ఆర్టికల్ -370 ను రద్దు చేయడం గురించి పీడీపీ అధ్యక్షుడు మెహబూబా ముఫ్తీ ఇటీవల చేసిన ప్రకటనపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి భారతదేశం,దేశ చట్టాలు నచ్చకపోతే, ముఫ్తీ కుటుంబం పాకిస్తాన్ దేశానికి వెళ్లాలని పటేల్ సూచించారు.

Updated Date - 2020-10-28T14:26:25+05:30 IST