మేఘాలయలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-20T01:57:43+05:30 IST

మేఘాలయలో పెరిగిన కరోనా కేసులు

మేఘాలయలో పెరిగిన కరోనా కేసులు

షిల్లాంగ్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మేఘాలయ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు కొత్తగా రాష్ట్రంలో 112 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల ఇవాళ ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 4,557 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2,038 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. 2,483 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2020-09-20T01:57:43+05:30 IST