మేఘాలయ ముఖ్యమంత్రికి కరోనా

ABN , First Publish Date - 2022-01-21T23:26:47+05:30 IST

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో..

మేఘాలయ ముఖ్యమంత్రికి కరోనా

షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. ప్రస్తుతం తాను ఐసొలేషన్‌లో ఉన్నానని తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ కొద్దిరోజులు ఐసొలేషన్‌లో ఉంటానని చెప్పారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు తమకు ఎలాంటి లక్షణాలు కనిపించినా తక్షణం వైద్యపరీక్షలు చేయించుకోవాలని సంగ్మా సూచించారు.

Updated Date - 2022-01-21T23:26:47+05:30 IST