ఆహ్లాదకరమైన వాతావరణం కోసమే మెగాపార్క్‌లు

ABN , First Publish Date - 2022-01-20T06:15:59+05:30 IST

గ్రామాలల్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసమే ప్రభుత్వం బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జడ్పీ సీఈవో సురేష్‌కుమార్‌ అన్నారు.

ఆహ్లాదకరమైన వాతావరణం కోసమే మెగాపార్క్‌లు
బాలెంలలో పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సురేష్‌

సూర్యాపేటరూరల్‌, జనవరి 19: గ్రామాలల్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసమే ప్రభుత్వం బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జడ్పీ సీఈవో సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాలెంల, యర్కారం గ్రామాలల్లో బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పల్లె ప్రకృతి వనాలు, మెగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీవో వెంకన్న, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Updated Date - 2022-01-20T06:15:59+05:30 IST