ఎన్టీపీసీలో మెగా వాక్సినేషన్ క్యాంప్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-09T06:00:37+05:30 IST
రామగుండం ఎన్టీపీసీ ధన్వంతరి ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు.
జ్యోతినగర్, ఆగస్టు 8 : రామగుండం ఎన్టీపీసీ ధన్వంతరి ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీపీసీ జీఎం అలోక్చంద్ర ఠాకూర్ క్యాంపును ప్రారంభించారు. వారం రోజులపాటు నిర్వహించే శిబిరంలో 9500 మంది ఎన్టీపీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఆసుపత్రి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. రిజిస్ట్రేషన్, హెల్ప్డెస్కలను ఏర్పాటుచేశారు. శిబిరం మొదటి రోజు 128 మందికి వ్యాక్సిన్ వేశారు. ప్రారంభ కార్యక్రమంలో జీఎం(టీఎస్) పుష్పేంద్రకుమార్ లాడ్, ఎన్టీపీసీ ఆసుపత్రి చీఫ్మెడికల్ ఆఫీసర్ ఇత్వారి రామ్లహ్రి, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.