22న మెగా జాబ్ మేళా
ABN , First Publish Date - 2022-01-19T05:01:56+05:30 IST
ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 22వ తేదీన నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు.
పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి సురేష్
ఎర్రగొండపాలెం, జనవరి 18 : ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 22వ తేదీన నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. స్థానిక క్యాంప్ ఆఫీసులో మంగళవారం మంత్రి సురేష్ మెగా జాబ్మేళా క్యాలెండర్, పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మేళాలో 30 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 10 తరగతి ఉత్తీర్ణత నుంచి పీజీ చదువుకున్న యువతీ, యువకులు అర్హులన్నారు. వెనుక బడిన ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే మెగా జాబ్మేళాను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ కిరణ్గౌడ్, జడ్పీటీసీ సభ్యుడు చేదూరి విజయభాస్కర్, పెద్దారవీడు జడ్పీటీసీ సభ్యుడు యేర్వ చలమారెడ్డి, సీఐ దేవప్రబాకర్ పాల్గొన్నారు.