నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్తో భేటీ
ABN , First Publish Date - 2021-02-25T05:56:53+05:30 IST
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం హైదరాబాద్లో కలిశారు.
నార్కట్పల్లి / చిట్యాల రూరల్, ఫిబ్రవరి 24: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం హైదరాబాద్లో కలిశారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు కేకేతో పాటు అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పరిచయం చేశారు. అదేవిధంగా చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన నర్రా నరేందర్రెడ్డికి ఎమ్మెల్యే చిరుమర్తి రూ.80వేల ఎల్ఓసీ చెక్కు అందించారు.