బంద్కు సహకరించాలని ఆర్టీసీ డీఎంకు వినతి
ABN , First Publish Date - 2021-03-03T04:19:08+05:30 IST
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన జరిగే బంద్కు సహకరించాలని పరిరక్షణ కమిటీ నాయకులు మంగళవారం కావలి ఆర్టీసీ డీఎం హరిబాబు, చాంబర్ఆ్పకామర్స్ అధ్యక్షుడు నేరెళ్ల జ్వాలారావు తదితరులను కలిసి వినతిపత్రాలు అందచేశారు.
కావలి, మార్చి 2: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన జరిగే బంద్కు సహకరించాలని పరిరక్షణ కమిటీ నాయకులు మంగళవారం కావలి ఆర్టీసీ డీఎం హరిబాబు, చాంబర్ఆ్పకామర్స్ అధ్యక్షుడు నేరెళ్ల జ్వాలారావు తదితరులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. కావలిలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) తదితర రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజాసంఘాలు కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో 5న జరుగు రాష్ట్ర బంద్కు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ నాయకులు గ్రంధి యానాది శెట్టి, జ్యోతి బాబూరావు, దామా అంకయ్య, పసుపులేటి పెంచలయ్య, కే. భాస్కర్, సయ్యద్ అబ్దుల్ హఫీజ్, షేక్. రసూల్ తదితరులు పాల్గొన్నారు.