కాసేపట్లో అమిత్‌ షాతో భేటీకానున్న జగన్‌

ABN , First Publish Date - 2020-02-15T01:42:37+05:30 IST

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. రాత్రి 9గంటలకు అమిత్‌ షాతో జగన్‌ భేటీకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

కాసేపట్లో అమిత్‌ షాతో భేటీకానున్న జగన్‌

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. రాత్రి 9గంటలకు కేంద్రమంత్రి అమిత్‌ షాతో  జగన్‌ భేటీకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పర్యటనలో రాజధాని, విభజన చట్టం, అభివృద్ధి నిధులపై చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చారు. శుక్రవారం ప్రత్యేకంగా అమిత్‌షాను మాత్రమే కలుస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉభయుల చర్చల్లో శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ప్రధాన ఎజెండా అని చెబుతున్నారు.  

Updated Date - 2020-02-15T01:42:37+05:30 IST