స్టైఫండ్ ఎప్పుడిస్తారు?
ABN , First Publish Date - 2021-03-05T08:11:01+05:30 IST
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట జూనియర్ వైద్యులు గురువారం ఆందోళనకు దిగారు.
జీజీహెచ్ ఎదుట జూడాల ఆందోళన
విధులు బహిష్కరించి నిరసన
నెల్లూరు (వైద్యం), మార్చి 4 : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట జూనియర్ వైద్యులు గురువారం ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జూడాల సంఘం అధ్యక్షుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత 7 నెలలుగా తమకు స్టైఫండ్ రావడం లేదన్నారు. దీంతో 150 జూడాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి నెల రూ. 19వేల ఇవ్వాల్సి ఉండగా నేటికీ రాలేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా ఫలి తం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ వైద్య సేవల విధులు బహిష్కరించామన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే అత్యవసర చికిత్సలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు.