మెడికో ఆత్మహత్య.. తట్టుకోలేక తాత మృతి..
ABN , First Publish Date - 2020-09-22T16:45:42+05:30 IST
వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తాత కూడా మృతి చెందాడు. వలసరవాక్కం సమీపంలోని రామాపురం కన్నదాసన్నగర్కు చెందిన నందగోపాల్
చెన్నై : వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తాత కూడా మృతి చెందాడు. వలసరవాక్కం సమీపంలోని రామాపురం కన్నదాసన్నగర్కు చెందిన నందగోపాల్ కుమారుడు ఆకాష్(22) చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు ఆకాష్ హాజరవుతున్నాడు. అయితే తన గదిలోకి వెళ్లిన ఆకాష్ ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో సందేహించిన తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూడగా ఆకాష్ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. సమాచారం అందుకున్న రాయలానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆకాష్ కొద్దిరోజులుగా దిగులుగా ఉండడంతో తల్లిదండ్రులు అతనిని సైకియాట్రిస్ట్కు చూపించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఆకాష్ మృతిచెందాడన్న వార్త విని ఆంధ్ర నుంచి ఆదివారం వచ్చిన తాత జయరామన్(74) గుండెపోటుతో మృతిచెందాడు. మనమడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన తాత కూడా మృతిచెందడం కుటుంబసభ్యులు, బంధువుల్లో విషాదం నింపింది.