ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో వైద్యసేవలు అందించాలి

ABN , First Publish Date - 2020-08-09T11:10:22+05:30 IST

కరోనా బారిన పడిన ప్రభుత్వ ఉద్యో గులకు ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వ ఉద్యోగుల ..

ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో వైద్యసేవలు అందించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 8: కరోనా బారిన పడిన ప్రభుత్వ ఉద్యో గులకు ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు కోరారు. శనివారం ఒంగోలులో డీఆర్వో కృష్ణవేణిని కలిసి వినతిపత్రం అం దజేశారు. గత ఐదు నెలల నుంచి అనేక మంది ఉద్యోగులు వైరస్‌తో మృ త్యువాతపడ్డారని, కొంతమంది చికిత్స పొందుతున్నారని ఆయన డీఆర్వో దృ ష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ప్రత్యేక  వైద్యంతో పాటు రెఫరల్‌ ఆస్పత్రిని ఏ ర్పాటు చేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కిరణ్‌కుమా ర్‌రెడ్డి, కె.పాండురంగారెడ్డి, కె.శివరామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:10:22+05:30 IST