మేడ్చల్: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
ABN , First Publish Date - 2022-03-17T00:00:12+05:30 IST
జిల్లాలోని జవహర్నగర్లో విషాదం నెలకొంది. జవహర్నగర్ పీఎస్
మేడ్చల్: జిల్లాలోని జవహర్నగర్లో విషాదం నెలకొంది. జవహర్నగర్ పీఎస్ పరిధిలోని చెన్నపురం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈదుళ్ల చెరువులో ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే ఈత రాక వీరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతై మృతి చెందారు. ముగ్గురు పిల్లల మృతదేహాలను గత ఈతగాళ్లు వెలికితీశారు. మృతులను మృతులు నవీన్ (12), విజయ్ (12), చందుగా గుర్తించారు. విద్యార్థులు శిశు జ్ఞానమందిర్లో చదువుకుంటున్నారు.