మల్కాజిగిరిలో మహిళ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-04-21T19:55:24+05:30 IST

జిల్లాలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

మల్కాజిగిరిలో మహిళ అనుమానాస్పద మృతి

మేడ్చల్: జిల్లాలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మల్కాజిగిరిలోని విష్ణుపురి ఎక్స్టెన్షన్‌లో నివాసం ఉండే ఉమాదేవి (56) ఈ నెల 18న గుడికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భర్త మూర్తి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం అదే కాలనిలోని గుడి ప్రాంగణంలో రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఉమాదేవి మృతదేహం లభ్యమైంది. మహిళ మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-04-21T19:55:24+05:30 IST