మేడ్చల్లో వివాహిత అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-09-15T16:59:33+05:30 IST
జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్సార్నగర్ కాలనీలో దివ్య (18) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
మేడ్చల్: జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్సార్నగర్ కాలనీలో దివ్య (18) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో దివ్య మృతి చెందగా భర్త రోహిత్ దివ్య మృతదేహాన్ని తీసుకొచ్చి జవహర్ నగర్ మహిళ ఇంట్లో వదిలి వెళ్లడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్టుకున్న భర్తనే భార్యను చంపాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.