మేడ్చల్: అయ్యప్ప ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-02-25T14:32:17+05:30 IST
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల అయ్యప్ప స్వామి ఆలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల అయ్యప్ప స్వామి ఆలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గుడి ఆవరణలో సీసీ కెమెరాల కేబుల్ను కత్తిరించి మరి దొంగతనం చేశారు. ఆలయంలోని వెండి గణపతి విగ్రహం, వెండి కిరీటం, హుండీలోని డబ్బులను దుండగులు తస్కరించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.