జాతీయ టోర్నీలో విశాఖ షూటర్లకు పతకాలు

ABN , First Publish Date - 2022-07-07T05:44:16+05:30 IST

నేషనల్‌ క్రాస్‌ బౌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో విశాఖకు చెందిన రైఫిల్‌ షూటర్లు అద్భుత ప్రతిబ కనబరిచి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించారు.

జాతీయ టోర్నీలో విశాఖ షూటర్లకు పతకాలు
పతకాలు సాధించిన గణేష్‌, నేహా, సాయి కౌషిక్‌

విశాఖపట్నం(స్పోర్ట్సు), జూలై 6: నేషనల్‌ క్రాస్‌ బౌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో విశాఖకు చెందిన రైఫిల్‌ షూటర్లు అద్భుత ప్రతిబ కనబరిచి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించారు. ఆగ్రాలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్‌ పురుషుల కాంపౌండ్‌ రైఫిల్‌ షూటింగ్‌లో ఆర్‌.గణేష్‌, సీనియర్‌ మహిళల రికర్వ్‌ ఈవెంట్‌లో నేహా పట్నాయక్‌ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. జూనియర్‌ బాలుర కాంపౌండ్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో సాయి కౌషిక్‌ స్వర్ణ పతకం, సీనియర్‌ మహిళల కాంపౌండ్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అనుణిత వల్లూరి రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలోని ఎంవీపీ కాలనీలోని భారత్‌ షూటింగ్‌ అకాడమీలో జరిగిన విలేకరుల సమావేశంలో అకాడమీ వ్యవస్థాపకుడు, కోచ్‌ గణేష్‌ మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న ఈ క్రీడాకారులు అతి తక్కువ సమయంలో జాతీయ టోర్నీలో పతకాలు సాధించే స్థాయికి చేరడం విశేషమని పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-07T05:44:16+05:30 IST