Medak: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-03-15T17:26:03+05:30 IST
జిల్లాలోని మాసాయిపేట మండలం చెట్ల తిమ్మయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పులి గుట్టతండాలో విషాదం చోటు చేసుకుంది.
మెదక్: జిల్లాలోని మాసాయిపేట మండలం చెట్ల తిమ్మయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పులి గుట్టతండాలో విషాదం చోటు చేసుకుంది. దశరథ్ అనే రైతు అప్పుల బాధ భరించలేక వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో పాటు పోడు భూముల సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.