మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-03-10T14:42:07+05:30 IST

జిల్లాలోని సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

మెదక్: జిల్లాలోని సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ - కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-10T14:42:07+05:30 IST