డీసీఎం కింద పడి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2021-05-17T17:49:42+05:30 IST
జిల్లాలోని తుప్రాన్ నర్సాపూర్ చౌరస్తా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నైనసాబ్(70)మృతి చెందారు.
మెదక్: జిల్లాలోని తుప్రాన్ నర్సాపూర్ చౌరస్తా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నైనసాబ్(70)మృతి చెందారు. రావెళ్లి గ్రామానికి చెందిన నైనసాబ్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున బయట తిరగ వద్దని వైద్యులు సూచించారు. కాగా ఈ రోజు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి ట్రాన్స్పోర్టు డీసీఎం కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన నైనసాబ్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.