దుబాయ్‌లో మెదక్‌ జిల్లా వాసి మృతి

ABN , First Publish Date - 2021-10-20T05:06:03+05:30 IST

ఉపాధికోసం దుబాయ్‌ వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

దుబాయ్‌లో మెదక్‌ జిల్లా వాసి మృతి
రోదిస్తున్నకుటుంబ సభ్యులు, (ఇన్‌సెట్‌లో) మోహన్‌(ఫైల్‌)

 హవేళీఘణపూర్‌, అక్టోబరు 19: ఉపాధికోసం దుబాయ్‌ వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండల పరిధిలోని జక్కన్నపేట గ్రామానికి చెందిన ఎల్లారపు మోహన్‌(34) ఐదేళ్లక్రితం ఉపాఽధి కోసం దుబాయ్‌కి వలస వెళ్లాడు. రెండేళ్ల క్రితం వచ్చి కుటుంబీకులను కలిసి తిరిగి మళ్లీ దుబాయ్‌ వెళ్లాడు.  సోమవారం మోహన్‌ గుండెపోటుతో మృతిచెందాడని స్నేహితులు తెలుపడంతో కుటుంబీకులు దుఃఖసాగరంలో మునిగారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన కుమారుడు చనిపోవడంతో తాము వీధిన పడ్డామని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.  ప్రజాప్రతినిధులు స్పందించి మోహన్‌ మృతదేహాన్ని త్వరగా తెచ్చేందుకు కృషి చేయాలని కుటుంబీకులు కోరారు. 

 

Updated Date - 2021-10-20T05:06:03+05:30 IST