రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

ABN , First Publish Date - 2021-11-18T23:17:06+05:30 IST

జమునా హేచరీస్‌లో భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా

రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

మెదక్: జమునా హేచరీస్‌లో భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ శరీష్ తెలిపారు. మాసాయిపేట మండలంలోని హకీంపేటలో ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ భూముల సర్వే పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. సర్వే పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని రైతులకు  కలెక్టర్ సూచించారు. సర్వే పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తామన్నారు.  హద్దులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చేపట్టామన్నారు. ఈ విషయంలో జమున హేచరీస్ కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రొసీజర్ ప్రకారమే సర్వే చేయాలనే కోర్టు ఆదేశాల మేరకు  తిరిగి సర్వే ప్రారంభమైందన్నారు. సర్వేలో సీలింగ్ లాండ్, అసైన్మెంట్ లాండ్, పట్టా భూమి ఎంత అనేది ఖచ్చితంగా తేలుస్తామన్నారు. 



Updated Date - 2021-11-18T23:17:06+05:30 IST