బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-04-10T11:27:11+05:30 IST

కరోనా వైరస్‌ నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్త చర్యలు చేపడుతుందని ఇందులో భాగంగానే బహిరంగ

బహిరంగ ప్రదేశాల్లో  ఉమ్మి వేస్తే చర్యలు

కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్త చర్యలు చేపడుతుందని ఇందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఉమ్మి వేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కామారెడ్డి మున్సిపల్‌ ఇన్‌చార్జీ కమిషనర్‌ శైలజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి విషయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో ఆరోగ్య పరంగా శుభ్రత పాటించుటకు, అనారోగ్య అలవాట్లు పాటించడం వల్ల ఎక్కువ మొత్తంలో ఈ వైరస్‌ వ్యాపించుటకు ప్రమాదం ఉందని ప్రభుత్వ వైద్య ఆరోగ్య సూచించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని తమలపాకులు నమిలి ఉమ్మి వేయడం, జర్దా, తంబాకు లాంటి గుట్కాలు నములుట, చప్పరిచ్చుట, ఉమ్మివేయడం నిషేధించినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2020-04-10T11:27:11+05:30 IST