అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2021-04-16T05:19:18+05:30 IST

ఉట్నూర్‌ ఏజెన్సీలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా సమాచారం అందిస్తే నివారణ చర్యలు తీసుకుంటామని ఉట్నూర్‌ ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ మెన్‌ దుర్గం రాజలింగం అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో ఫైర్‌ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు.

అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు
ఉట్నూర్‌లో విన్యాసాలు ప్రదర్శిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఉట్నూర్‌, ఏప్రిల్‌ 15: ఉట్నూర్‌ ఏజెన్సీలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా సమాచారం అందిస్తే నివారణ చర్యలు తీసుకుంటామని ఉట్నూర్‌ ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ మెన్‌ దుర్గం రాజలింగం అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో ఫైర్‌ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపదసమయంలో అగ్నికిలలను ఆర్పే పద్ధతులను ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరించారు. 1944లో ముంబాయిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడంతో వారి స్మారకం కోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు 101కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్‌ నర్సింగ్‌రావు, లీడ్‌ ఫైర్‌ మెన్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T05:19:18+05:30 IST