ధరలు పెంచి విక్రయిస్తే చర్యలు : ఏఎ్సఓ
ABN , First Publish Date - 2021-11-27T05:07:03+05:30 IST
వరదల కారణంగా నిత్యావసర సరుకులు అక్రమంగా నిల్వపెట్టి ధరలు పెంచి విక్ర యిస్తే చర్యలు తప్పవని జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పౌరసరఫరాల సహాయ అధికారి సుబ్బారెడ్డి హెచ్చరించారు.
ప్రొద్దుటూరు అర్బన్ నవంబరు 26: వరదల కారణంగా నిత్యావసర సరుకులు అక్రమంగా నిల్వపెట్టి ధరలు పెంచి విక్ర యిస్తే చర్యలు తప్పవని జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పౌరసరఫరాల సహాయ అధికారి సుబ్బారెడ్డి హెచ్చరించారు.శుక్రవారం స్థానిక మండి మర్చంట్ అసోషియేషన్ కార్యాలయంలో ఆయన ట్రేడర్స్ తో సమావేశమై మాట్డాడుతూ సరుకులు అక్రమ నిల్వలు పెట్టి కృత్తిమంగా ధరలు పెంచి విక్రయించే వారిపై నేరుగా కేసులు పెట్టమని జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి ఆదేశించారన్నారు. సరుకులు రావడంలో ఆలస్యం అవుతున్న ఇతర ఏ కారణాలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. బియ్యంతో సహా ఇతర నిత్యావసర సరుకుల ధరలు ప్రభుత్వం నిర్ణ యించిన ధరలకంటే అధికంగా విక్రయించినా చర్యలుంటాయన్నారు.ఽ దరలపై ప్రత్యేక పర్యవేక్షణా టీంలను కూడా ఏర్పాటు చేశామని ఎక్కడైనా అలా జరింగిందని తెలిస్తే జిల్లా అధికారులు నేరుగా రంగంలోకి దిగుతారన్నారు.గౌడౌన్లపై అక్రమ నిల్వలపై కూడా ప్రత్యేక నిఘా టీంలు వున్నాయన్నారు. కార్యక్రమంలో మండి మర్చంట్ అసోషియేషన్ అధ్యక్షుడు రోషన్ మిల్లు ఆర్ఐ స్వామిలు పాల్గొన్నారు.