జీవనోపాదుల మెరుగునకు చర్యలు

ABN , First Publish Date - 2022-06-23T05:46:22+05:30 IST

జీవనోపాదుల మెరుగునకు చర్యలు

జీవనోపాదుల మెరుగునకు చర్యలు
మాట్లాడుతున్న శాంతిశ్రీ


- డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ
ఎచ్చెర్ల, జూన్‌ 22: స్వయంశక్తి సంఘ సభ్యుల జీవనోపాదుల మెరుగున కు అవసరమైన చర్యలు తీసుకుంటు న్నట్టు డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ తెలిపా రు. ఎచ్చెర్లలోని మండల మహిళా సమా ఖ్య కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు స్వయంఉపాధి ఏర్పాటు చేసుకొనే దిశగా ముందుకు సాగాలన్నారు. గ్రామ స్థాయిలో సంఘాలను బలోపేతం చేసి, ఆర్థిక స్వావలంభనకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సంఘాలు నిర్దేశించిన సమయంలో సమావేశమై, అజెండా మేరకు చర్చించుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో పావని, ఏపీఎం వెంకట రత్నం, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-23T05:46:22+05:30 IST