ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు

ABN , First Publish Date - 2022-05-21T05:33:48+05:30 IST

గాంధీ పార్కుకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు.

ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌,మే20: గాంధీ పార్కుకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు. శుక్రవారం గాంధీ పార్కును సందర్శించి ఇక్కడి వసతులు, నర్సరీలను పరిశీలించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఆట వస్తువులను పరిశీలించి వాటిని మరమ్మతులు లేదా కొత్తవాటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గాంధీ పార్కును అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిలో నిధులను మంజూరు చేసుకుని పనులను చేపడతామన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వర్షకాలంలో హరితహారంలో అత్యధికంగా మొక్కలు నాటేలా కార్యచరణను రూపొందిస్తున్నామన్నారు. దానికి అనుగుణంగానే నర్సరీల్లో మొక్కలను అందుబాటులో ఉంచేలా అధికారులకు సూచనలు చేశామని స్పష్టం చేశారు.ఆయనతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ ఏఈ అరుణ్‌కుమార్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-05-21T05:33:48+05:30 IST