ధాన్యం తూకం సరిగా చేయకుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-05-16T04:39:39+05:30 IST

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం సరిగా వేయకుంటే చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌ అన్నారు

ధాన్యం తూకం సరిగా చేయకుంటే చర్యలు
మాట్లాడుతున్న సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌

- సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌  

జన్నారం, మే 15: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం సరిగా వేయకుంటే చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌  అన్నారు. మండలంలోని కవ్వాలలో ఏర్పాటు చేసిన ఽకొనుగోలు కేంద్రంలో బస్తాకు 2 కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేస్తున్నారని గ్రామానికి చెందిన రైతు తిరుపతి ఆదివారం ఉదయం ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. మంత్రి పేషీ నుంచి కలెక్టర్‌కు  సమాచారం అందడంతో ఆమె సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌ ను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయన కొనుగోలు కేంద్రానికి చేరుకు ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ధాన్యం తూకం సరిగా వేయకుంటే  కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిం చారు. ఆయన వెంట సీఈవో రాజన్న తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-16T04:39:39+05:30 IST