పోలీ్‌సశాఖ గౌరవం పెంచాలి

ABN , First Publish Date - 2021-04-17T05:29:16+05:30 IST

పోలీ్‌సశాఖ గౌరవం పెంచాలి

పోలీ్‌సశాఖ గౌరవం పెంచాలి
బదిలీపై వెళ్తున్న సీఐలు, ఎస్సైలను సన్మానిస్తున్న ఎస్పీ

ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 16 : పోలీస్‌ సిబ్బంది ఎక్కడ పనిచేసినా పోలీ్‌సశాఖ గౌరవం పెంచేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తించిన అక్కడ ప్రజల అభిమానం పొందడంతో పాటు వారు మెచ్చుకునే విధంగా ఉద్యోగ బాధ్యతను నిర్వహించాలన్నారు. మహబూబాబాద్‌ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో సీఐగా విధులు నిర్వర్తించిన నాగేశ్వర్‌రావును మహబూబాబాద్‌ జిల్లా ఇంటలిజెన్స్‌ సీఐగా బదిలీ చేశారు. సీఐ శ్యాంసుందర్‌ను వరంగల్‌ జిల్లా ఏసీబీ సీఐగా, సీఐ కరుణాకర్‌ను నర్మెట సీఐగా, జిల్లా హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ఫణిదర్‌ను డీసీఆర్బీకి, తహేర్‌బాబాను ఎస్బీఐ మహబూబాబాద్‌కు, ఎస్సై అశోక్‌ను వరంగల్‌ కమిషనరేట్‌కు బదిలీ చేస్తూ పోలీ్‌సశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న సీఐలు, ఎస్సైలను సత్కరించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ రేలా జనార్దన్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-17T05:29:16+05:30 IST