ఎంపీ కవితకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-17T05:27:32+05:30 IST
ఎంపీ కవితకు కరోనా పాజిటివ్
మహబూబాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం స్వయంగా ఆమె వెల్లడించారు. రెండు రోజులుగా జలుబుతో బాధపడుతుండగా అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయొంచుకోగా అందులో పాజిటివ్ వచ్చింది. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. తన కుటుంబ సభ్యులతో స్వీయ రక్షణలో ఉంటున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో వివిధ పనుల నిమిత్తం తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.