ఆస్తుల వివరాలు నమోదు చేయించుకున్న మేయర్‌

ABN , First Publish Date - 2020-10-01T09:34:32+05:30 IST

నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు తన ఆస్తుల వివరాలను బుధవారం జీడబ్ల్యూఎంసీ అధికారులకు తెలిపి నమోదు

ఆస్తుల వివరాలు నమోదు చేయించుకున్న మేయర్‌

వరంగల్‌ సిటీ, సెప్టెంబరు 30: నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు తన ఆస్తుల వివరాలను బుధవారం జీడబ్ల్యూఎంసీ అధికారులకు తెలిపి నమోదు చేయించుకున్నారు. నగరంలో ఆస్తుల సర్వేకు ప్రజలు సహకరించాలని జీడబ్ల్యూఎంసీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు ఈసందర్భంగా కోరారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 58 డివిజన్లలో ఆస్తుల సర్వే జరుగుతోందన్నారు. 2 లక్షలకు పైగా ఆస్తుల సమాచారాన్ని సేకరించి రెవెన్యూ శాఖకు అందజేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీవో శాంతికుమార్‌, డీఈ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T09:34:32+05:30 IST