హైదరాబాద్: భార్య సీట్లో కూర్చొని భర్త పెత్తనం
ABN , First Publish Date - 2021-07-29T17:38:24+05:30 IST
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ భర్త దీప్లాల్ చౌహన్ వ్యవహారశైలి దుమారం రేపుతోంది.
హైదరాబాద్: మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ భర్త దీప్లాల్ చౌహన్ వ్యవహారశైలి దుమారం రేపుతోంది. భార్య సీట్లో కూర్చొని భర్త పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మేయర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై దీప్లాల్ చౌహన్ బెదిరింపులకు దిగుతున్నాడు. అతని నిర్వాకాన్ని వీడియో తీసేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేస్తున్నాడు. కాసులిస్తేనే కార్యాలయంలోకి అనుమతి ఇస్తానని చెబుతున్నాడు. ముడుపులిస్తేనే కార్పొరేటర్లకు బిల్లులు పాస్ చేయిస్తానంటున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై కూడా చిర్రుబుర్రులాడాడు.